బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే నర్సాపూర్ నియోజకవర్గంలో ఐటీహబ్, పరిశ్రమలను స్థాపిస్తామని, నర్సాపూర్ ప్రాంతాన్ని రాజన్న సిరిసిల్ల జోన్ నుంచి చార్మినార్ జోన్కు మారుస్తామని ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు హామీ ఇచ్చారు.
ఆదివారం నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్షోకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి కేటీఆర్ ప్రసంగాన్ని వినడానికి నర్సాపూర్ నియోజకవర్గంలోని 8 మండలాల ప్రజలు భారీగా తరలివచ్చారు. కేటీఆర్ మాటలను శ్రద్ధగా విన్నారు.