మియాపూర్: ప్రజారోగ్యానికే సవాల్గా మారిన కరోనాను కట్టడి చేసేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయక సేవలను అందించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలను ప్రజలు ఎన్నటికీ మరిచిపోబోరని , చిరస్మరణీయంగా నిలిచిపోతాయని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. అందుకే వారి సేవలకు గుర్తుగా గౌరవసూచకంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవటం సంతోషకరమన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి సమీపంలో వివేకానందుడి విగ్రహం వద్ద రూ. 11 లక్షలతో చేపట్టిన జంక్షన్ సుందరీకరణ పనులతో పాటు పారిశుద్ద్య కార్మికులు, వైద్యులు, పోలీస్ విగ్రహాలను కూకట్పల్లి జోనల్ కమీషనర్ మమత, కార్పొరేటర్ మాధవరం రోజాదేవితో కలిసి విప్ గాంధీ శనివారం రాత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రేమించే మనసుకు వైద్యరంగం, పనిచేసే చేతులకు పారిశుద్ద్య కార్మికులు, స్పందించే మనసుకు పోలీసు శాఖ నిదర్శనంగా వారి విగ్రహాల ఏర్పాటు ఆలోచన గొప్పదన్నారు. ఈ విగ్రహాలు ప్రతి ఒక్కరినీ వారి సేవల పట్ల ఆలోచింపచేస్తాయని , ఆయా రంగాలకు యావత్ ఈ విగ్రహాలు స్పూర్తిదాయకంగా నిలుస్తాయని విప్ గాంధీ పేర్కొన్నారు.
ఉన్న కొద్ది స్థలాన్ని సద్వినియోగం చేసి సుందరవనంగా తీర్చిదిద్దిన అధికారులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఈఈ గోవర్ధన్, ఏఈ స్వప్ప, సుధాకర్,భద్రయ్య, పార్టీ నేతలు రంగారావు, సంజీవ్, చంద్రకాంత్రావు, రాజేశ్వర్రావు, రాంచందర్రావు, కార్తీక్రావు, విజయబాబు, ప్రసాద్,అల్లం మహేశ్, ప్రవీణ్, మురళీ,రమణారెడ్డి,జగదీశ్, రవీందర్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.