హైదరాబాద్ : గణేశ్ ఉత్సవాల సందర్భంగా హెచ్ఎండీఏ తరఫున 70 వేల మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్లోని 30 ప్రదేశాల్లో ప్రజలకు ఉచితంగా విగ్రహాల పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
బీఆర్కే భవన్లో వినాయకుడి ప్రతిమల పింపిణీ కార్యక్రమాన్ని సీఎస్ సోమేశ్ కుమార్ ప్రారంభించారు. రేపటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకూ 4 మొబైల్ వ్యాన్ల ద్వారా గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తారని వెల్లడించారు. వంద కంటే ఎక్కువ విగ్రహాలు కావాలనుకునేవారు హెచ్ఎడీఏను సంప్రదించాలని సూచించారు.