మీరట్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులు ఏ మాత్రం ఆశలు వదులుకోవద్దని, వెనుకడుగు వేయవద్దని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంకాగాంధీ వాద్రా సూచించారు. రైతుల ఆందోళన ఇప్పటికే 100 రోజులు దాటిందని, 100 రోజులే కాదు, 100 వారాలైనా, 100 నెలలైనా పోరాటం సాగించాలని చెప్పారు. రైతులకు మద్దతుగా తాము కూడా పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని, కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి నల్ల చట్టాలను వెనక్కి తీసుకునే వరకు పోరాడుదామని ఆమె పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్లో జరిగిన కిసాన్ మహాపంచాయత్ ర్యాలీలో మాట్లాడిన ప్రియాంకాగాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.