హైదరాబాద్ : జమీర్ కుటుంబానికి అండగా ఉంటామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మూడు రోజుల క్రితం జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామం వద్ద గోదావరి నదిలో చిక్కుకున్న వ్యవసాయ కూలీల వార్త కవరేజ్ చేసేందుకు వెళ్లిన ఎలక్ట్రాన్ మీడియా రిపోర్టర్ జమీర్.. వరదలో చిక్కుకొని మరణించడం బాధాకరమన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాల ఆదుకుంటామన్నారు.