జూబ్లీహిల్స్ లోని నివాసంలో ప్రముఖ సినీ నటులు కృష్ణంరాజు (krishnam raju) భౌతికకాయానికి నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawankalyan) నివాళులర్పించారు. అనంతరం పవన్ కల్యాణ్ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. సుప్రసిద్ద నటులు, నిర్మాత.. ప్రత్యేకించి మా కుటుంబానికి ఎంతో సాన్నిహిత్యం ఉన్న వ్యక్తి కృష్ణంరాజు చనిపోవడం మాకు ఎంతో బాధ కలిగించిందన్నారు.
‘ మేం కలుసుకుంది చాలా తక్కువ సందర్భాలే అయినా కృష్ణంరాజు, ఆయన సతీమణి నా మీద ఎంతో ప్రేమ, వాత్సల్యం చూపించేవారు. చెన్నైలో కృష్ణంరాజుగారుంటున్న వీధిలోనే మేమూ ఉండేవాళ్లం. మనవూరి పాండవులు సినిమా నుంచి మా అన్నయ్యతోపాటు నా జీవితంలో నేనూ విన్న మొదటి హీరో కృష్ణంరాజు. విశిష్ణ పార్లమెంటేరియన్గా ఉండి అందరికీ చేదోవాదోడుగా ఉండే వ్యక్తి కృష్ణంరాజు ..అందరి మంచిని కోరుకునే వ్యక్తి. యాక్టర్గా ఆయనకున్న టాలెంటే కాకుండా నిర్మాతగా మంచి సినిమాలు నిర్మించారు. కృష్ణంరాజు అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి అన్నారు ‘ పవన్ కల్యాణ్.
ప్రభాస్, ఆయన సోదరీమణులు, కృష్ణంరాజు సతీమణికి, ఆయన అభిమానులకు నా సంతాపం తెలియజేస్తున్నా. కృష్ణంరాజుగారి ఆత్మకుశాంతి చేకూరాలని కోరుకుంటున్నానన్నారు పవన్ కల్యాణ్.
Read Also : రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత