కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ నుంచి పూర్తిగా తాము వెళ్లిపోవడం లేదని తాలిబాన్ ఉగ్రవాదులు గుర్తుంచుకోవాలని అమెరికా ఘాటుగా హెచ్చరించింది. ఆఫ్ఘనిస్తాన్లో పెరుగుతున్న హింస సంఘటనలకు ప్రజలు కూడా బాధితులైన తర్వాత ఇప్పుడు అమెరికా వైఖరి కఠినంగా మారింది. అమెరికా రక్షణ శాఖ పెంటగాన్లో ఆఫ్ఘనిస్తాన్పై నిబద్ధత ఉన్నదని, వారు ఆఫ్గాన్ దేశం నుండి దూరంగా వెళ్లడం లేదని పేర్కొన్నది. నాటో దళాలు కూడా ఇలాంటి హామీనే ఇచ్చింది.
ఆఫ్ఘనిస్తాన్లో సైనిక మిషన్ ముగిసిందని, అందుకని తమ దళాలను ఉపసంహరించుకున్నందున ఈ ప్రాంతం నుంచి దూరంగా వెళ్తున్నట్లు భావించరాదని పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ బుధవారం మీడియా సమావేశంలో తాలిబాన్, ఇతర ఉగ్రవాద సంస్థలను పరోక్షంగా హెచ్చరించారు. తాము ఇప్పటికీ మధ్యప్రాచ్య ప్రాంతంలో బలమైన స్థితిలో ఉన్నామన్న విషయం మరువరాదన్నారు.
ఇదే సమయంలో నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ కూడా ఇదే విధమైన మాట చెప్పారు. నాటో ఆఫ్ఘనిస్తాన్ పట్ల తన బాధ్యతను కొనసాగిస్తుందని అన్నారు. ఇది శాంతి ప్రయత్నాలకు దోహదం చేస్తూనే ఉంటుందని తెలిపారు.
ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది. నేషనల్ సెక్యూరిటీ డైరెక్టరేట్ ప్రకారం, ఈ సంవత్సరం తాలిబాన్ ఉగ్రవాదులు 3,500 కు పైగా దాడులు చేశారు. గత వారాలుగా, బాగ్లాన్, హెల్మండ్, కుండుజ్, కందహార్, లాగ్మాన్ సహా అనేక ప్రావిన్సుల్లో తీవ్రమైన పోరాటం కొనసాగుతున్నది.
అమెరికా అత్యున్నత దౌత్యవేత్త జెఫ్రీ డెలరాంటిస్ కూడా ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతూ.. తాలిబాన్లు పౌర ప్రాంతాలలో దాడులను వెంటనే నిలిపివేయాలని సూచించారు. ప్రస్తుతం ఈ దాడులు దవాఖానలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, మసీదుల చుట్టూ జరుగుతున్నాయని, ఇది అంతర్జాతీయ చట్టాల బహిరంగ ఉల్లంఘనే అని ఆయన అన్నారు.
వ్యాక్సిన్ నిలపాలంటూ పిటిషన్.. పిటిషన్దారుకు 50 వేల జరిమానా..
భారత్లో 130 రోజుల్లో 20 కోట్ల మందికి వ్యాక్సిన్
పాకిస్తాన్తో యుద్ధం వస్తే రాష్ట్రాలు సొంత ట్యాంకులు కొని పోరాడాలా? : కేజ్రీవాల్
మధ్యప్రదేశ్లో పీపీఈ కిట్ల కుంభకోణం..
ఇక ఎవరి ఆస్తికి నష్టం కలిగించినా భర్తీ చేయాల్సిందే..!
సముద్రంలో అరుదైన ఖనిజాలను కనుగొన్న జపాన్
7 ఏండ్లలో మోదీ 7 నిర్ణయాలు.. ప్రతి భారతీయుడిపై ప్రభావం
భారత ప్రధానిగా మోదీ ప్రమాణం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..