వరంగల్ : పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులతో ఉద్యానవనాలను తీర్చిదిద్దుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
ఆదివారం ప్రొఫెసర్ జయశంకర్ స్మృతి వనంలో వాకర్స్ డైరీని ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజలు గత అభివృద్ధిని ఇప్పుడు జరిగే అభివృద్ధికి మధ్య తేడా గమనించాలన్నారు. సీఎం కేసీఆర్ పరిపాలనకు నిదర్శనం జయశంకర్ సార్ స్మృతి వనం (ఏకాశిల పార్క్) సాక్ష్యం అని పేర్కొన్నారు. పార్క్ లో పంచాయతీలు వద్దు.
అహ్లాదకరమైన ప్రదేశంలో పిల్లలు ఆడుకునేందుకు వాకింగ్ చేయ్యడానికి వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఓపెన్ జీమ్ లను పార్క్ లలో ఏర్పాటు చేసిందన్నారు.
నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా పచ్చని నగరంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత హనుమకొండ నగరంలో పెట్ పార్క్ నెలకొల్పామని ఆదివారం పెట్ పార్క్ ని మనం సందర్శిద్దామన్నారు.