Warangal polytechnic | హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 22: మార్చి 29న (ఆదివారం) వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు పూర్వవిద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఈవీ శ్రీనివాస్ రావు తెలిపారు.
ఆదివారం కాలేజీలో జరిగిన పూర్వవిద్యార్థుల సమావేశంలో ఈవీ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. 70 ఏళ్ల పాలిటెక్నిక్ పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రతి పూర్వవిద్యార్థి తప్పనిసరిగా పాల్గొని, కాలేజీలో చదివిన రోజులు, మధురస్మృతులను స్మరించుకునే ఈ అరుదైన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఇందులో పాల్గొనే పూర్వవిద్యార్థులు వెంటనే రూ.1,000 నమోదు రుసుం జమచేసి తమ పూర్తి వివరాలను తెలియజేయాలని కోరారు. (బ్యాంకు వివరాలు: ఖాతా నెంబర్: 62052476227, ఖాతా పేరు: పూర్వ విద్యార్థుల సంఘం, వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్, బ్యాంకు పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, శాఖ: ఎంజీఎం వరంగల్). ఈ సందర్భంగా కాలేజీ అభివృద్ధి కోసం రూ.10 వేలు విరాళం అందించిన 1965 బ్యాచ్ పూర్వవిద్యార్థి ఎం.మల్లారెడ్డిని సమావేశంలో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పూర్వవిద్యార్థుల సంఘం పెద్దలు టీఎన్ స్వామి, ప్రకాష్, ఉదయభాస్కర్, శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి మేకల అక్షయ్కుమార్తో పాటు సీనియర్ నాయకులు బొద్దిరెడ్డి సతీష్రెడ్డి, ఇమ్మడి శ్రీనివాస్రావు, శ్యామ్, ఉమేందర్, వసంత్కుమార్, శశి, కుమార్, ఉషాకిరణ్, కార్తీక్, కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు.
Medak | మెదక్ జిల్లాలో దారుణం..భార్యను గొంతు కోసి హతమార్చి, నగలతో పరారైన భర్త
Modugapoolu | మోదుగు పువ్వులు విరబూస్తూ.. బాటసారులకు కనువిందు చేస్తూ
Rtc bus | లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్కు గాయాలు