కరీమాబాద్, ఏప్రిల్ 4 : తెలంగాణలో పండించిన ధా న్యం మొత్తం కేంద్రం కొనుగోలు చేయాల్సిదేనని ఖిలావరంగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చై ర్మన్ కేడల జనార్దన్ డిమాండ్ చేశారు. సోమవారం సీ ఎం కేసీఆర్ సూచనలతో టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాల మేరకు ఖిలావరంగల్ మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు, నాయకు లు రంగశాయిపేటలో రైతు నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ వరిని కేంద్రం కొనుగోలు చేయాలని యావత్ తెలంగా ణ ఏకగ్రీవంగా కోరుతున్నారన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం యావత్ తెలంగాణ ప్రజల కోరిక అయిన వరి కొనుగోలును కేంద్రం వెంటనే చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్లు పోశాల పద్మ, మరుపల్ల రవి, ఎస్ రాజు, ఎం అరుణ, ప్రవీణ్, సువర్ణ, కుమారస్వామి మాజీ కార్పొరేటర్లు కే పద్మ, పీ రవి, దామోదర్ నాయకులు మేడిది మధుసూదన్, నాగపురి సంజయ్బాబు, బజ్జూరి రవి, కలకోట్ల రమేశ్, కర్ర కుమార్, ఈదుల రమేశ్, కర్నె రవీందర్, కత్తి ఎల్లాగౌడ్, ఖిలావరంగల్ మండలానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేయాలి
నల్లబెల్లి: ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని మండల టీఆర్ఎస్ నాయకులు సోమవారం డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ శ్రేణులు మండలకేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బీ సారంగపాణి మాట్లాడారు. పండించిన వరి ధాన్యాన్ని కొనలేమంటూ కేంద్రం చేతులెత్తేయడం హేయమైన చర్య అన్నారు. అలాగే డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ తోపాటు నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కాయన్నారు. ఈ కార్యక్రంలో ఎంపీపీ ఊడుగుల సునీతాప్రవీణ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బీ సారంగపాణి, వైస్ ఎంపీపీ గందె శ్రీలతాశ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్రావు, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్గౌడ్, సర్పంచ్లు ఎన్ రాజారాం, చింతపట్ల సు రేశ్, ఊరటి అమరేందర్రెడ్డి, ఊరటి అమరేందర్రెడ్డి, ఎం మోహన్రెడ్డి, చింతపట్ల సురేశ్, తిరుపతి, అడ్డ రాజు, మోహన్రెడ్డి, కోఆప్సన్ మెంబర్ ఎండీ నజీమానన్నెసాహెబ్, రైతు బంధు సమితి మండల కోఆర్డీనేటర్ గోనెల పద్మానరహరి, ఎంపీటీసీ జయరావు, ఏ సాంబరావు, శ్రీనివాస్, హింగ్లి శివాజి, టీఆర్ఎస్ అధ్యక్షుడు క్యాతం శ్రినివాస్, సుబాస్ పాల్గొన్నారు.
చెన్నారావుపేట..
చెన్నారావుపేట: రాష్ట్రంలో రైతన్నలు పండించిన వరి ధాన్యాన్ని ఎలాంటి కొర్రీలు పెట్టకుండా చివరిగింజ వరకు బీజేపీ సర్కారు కొనాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని వివేకానంద జంక్షన్ వద్ద మండల పార్టీ అధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజేందర్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ బీ తిరుపతి, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు ఎండీ రఫీ, చెన్నారావుపేట, అమీనాబాద్ సొసైటీల చైర్మన్లు ఎం సత్యనారాయణరెడ్డి, ఎం రవి, ఆర్బీఎస్ జిల్లా డైరెక్టర్ టీ శ్రీనివాస్, సర్పంచ్ఫోరం మండలాధ్యక్షుడు కుండె మల్లయ్య, కార్యదర్శి ఏ కుమారస్వామి, మాజీ జడ్పీటీసీ జున్నూతులరాంరెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు ఎంఏ గఫార్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు సీహెచ్ విజేందర్రెడ్డి, టీఆర్ఎస్ యువనాయకుడు కంది కృష్ణచైతన్యారెడ్డి, చెన్నారావుపేట సొసైటీ వైస్చైర్మన్ చింతకింది వంశీ, టీఆర్ఎస్ మండల మహిళా విభాగం అధ్యక్షురాలు రాజులపాటి ఉమాదేవీఅశోక్, వివిధ గ్రామాల సర్పంచ్లు, పార్టీ అధ్యక్షులు, సొసైటీ డైరెక్టర్లు, ఆర్బీఎస్ కన్వీనర్ తదితరులు పాల్గొన్నారు.
నల్లబెల్లిలో..
నల్లబెల్లి: కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి డి మాండ్ చేశారు. వరిధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేయాలనే డిమాండ్ చేస్తూ మండల కాంగ్రెస్ శ్రేనులు మండలంలోని 365 జాతీయ రహదారిపై రా స్తారోకో చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మాలోత్ చరణ్సింగ్, వీ అశోక్, చార్ల శివారెడ్డి, చెల్పూరి జ్యోతి, సంపత్రెడ్డి, రాజకొమురయ్య, పోషాలు, రఘుపతి పాల్గొన్నారు.
వరి ధాన్యం కేంద్రం కొనేదాక పోరాటం..
కరీమాబాద్: తెలంగాణలో పండించిన ధాన్యం మొత్తం కేంద్రం కొనేదాక పోరాటం చేస్తామని 44వ డివిజన్ అధ్యక్షుడు కంకణాల సంపత్రెడ్డి సోమవారం సీఎం కేసీఆర్ సూచనలతో టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాల మేరకు మామునూరులో 43, 44వ డివిజన్ల ప్రజాప్రతినిధులు, నాయకులు మామునూరులో రైతు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అరుణ, నాయకులు జమీరొద్దీన్, 43, 44వ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నెక్కొండలో ..
నెక్కొండ: కేంద్ర ప్రభుత్వమే యాసంగి వరి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నెక్కొండలో టీఆర్ఎస్ శ్రేణలు స్థానిక అంబేద్కర్ కూడలిలో సోమవారం దీక్షలు చేపట్టారు. నిరసన దీక్షల్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంగని సూరయ్య, ఎంపీపీ జాటోత్ రమేశ్, జడ్పీటీసీ సరోజన హరికిషన్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొనిజేటి భిక్షపతి, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్ము రమేశ్యాదవ్, మాజీ మార్కెట్ చైర్మన్ సోమయ్య, మాజీ సొసైటీ చైర్మన్ కొ మ్మారెడ్డి రవీందర్రెడ్డి, ఉప సర్పంచ్ దేవనబోయిన వీరభద్రయ్య, రైతు సంఘం జిల్లా నాయకులు చల్లా చెన్నకేశవరెడ్డి, మండల నాయకులు తాటిపెల్లి శివకుమార్, బక్కి కుమార్, సురేశ్, పొడిశెట్టి సత్యం, ఇంద్రసేనారెడ్డి, చిన్నకొర్పోలు సర్పంచ్లు ఆలకుంట సురేందర్, అంశమ్మ, కర్ర వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
వరి ధాన్యంను కేంద్రమే కొనుగోలు చేయాలి గీసుగొండలో..
గీసుగొండ: రైతులు పండించిన వరిధాన్యంను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరగోని రాజుకుమార్ డిమాండ్ చేశారు. సోమవారం గీసుగొండ మండల కేంద్రంలో ని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, డీసీసీబీ డైరెక్టర్ దొంగలచ రమేశ్, రైతు బంధు కన్వీనర్ మాధవరెడ్డి, టీఆర్ఎస్ మండల కార్యదర్శి వేణుగోపాల్రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు జైసాల్రెడ్డి, బోడకుంట్ల ప్రకాశ్, మల్లారెడ్డి , నాగేశ్వర్రావు, అనిల్, దౌడుబాబు, నాగమణి, ఎంపీటీసీ వీరారవు, నాయకులు శ్రీనివాస్రెడ్డి శివకుమార్, రవీందర్రెడ్డి, స్వామిచౌహాన్, రమేశ్, చిన్ని, రాజయ్య. కట్టయ్య. ప్రమోద్, శ్రీకాంత్, ప్రభాకర్, శ్రీధర్, కార్యాకర్తలు పాల్గొన్నారు.
రైతుదీక్ష విజయవంతం
పర్వతగిరి: పర్వతగిరి మండల కేంద్రంలోని చౌరస్తాలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు నిరసన దీక్ష సోమవారం విజయవంతమైంది. అన్ని గ్రామాల నుం చి రైతులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముఖ్య అతిథిగా డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు విచ్చేసి ప్రసంగించారు. రైతులు పండించిన వరి పంటను కొనే దాకా కేంద్రంపై రైతు నిరసన ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బానోత్ సింగ్లాల్, ఎంపీపీ కమల పంతులు, పీఏసీఎస్ చైర్మన్ మనోజ్కుమార్గౌడ్, గొర్రె దేవేందర్, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్రావు, మార్కెట్ డైరెక్టర్ ఏకాంతంగౌడ్, సర్పంచ్ చింతపట్ల మాలతీ సోమేశ్వర్రావు, జితేందర్రెడ్డి, యుగేందర్రావు, సర్వర్, వెంకటేశ్వర్రావు పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ అధ్యక్ష కార్యదర్శులు రైతులు పాల్గొన్నారు.