ఆలేరురూరల్, ఆగస్టు 3 : అన్ని వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని టంగుటూరులో వక్ఫ్బోర్డు నిధులు రూ.4లక్షలతో నిర్మంచిన అశూర్ఖానాను (పీర్ల కొట్టం) బుధవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నదన్నారు. రంజాన్, బక్రీద్, మోహర్రం పండుగలకు ముస్లింలకు తగిన విధంగా తోడ్పాటు అందిస్తున్నదని పేర్కొన్నారు. చేనేత కార్మికులకు బీమాను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
త్వరలోనే కొత్త రేషన్కార్డులు, పింఛన్లు అందించనున్నట్లు చెప్పారు. టంగుటూరులో రూ.70 లక్షలతో సీసీ రోడ్డు పనులు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జ్ఞానప్రకాశ్రావు, ఎంపీటీసీ జూకంటి అనూరాధాఅనిల్, సర్పంచ్ కట్ట సమరసింహారెడ్డి, ఎంపీఓ సలీమ్, పంచాయతీరాజ్ డీఈ హేమంత్కుమార్, ఏఈ రమేశ్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఎలగందుల వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ నీల రామన్న, ఎలగందుల రామరుషి, శ్రవణ్, సయ్యద్ జాఫర్, సయ్యద్ రెహమాన్, సాబేర్, వాజిద్ పాల్గొన్నారు.