న్యూఢిల్లీ: తాజా ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధరకు అమ్ముడైన భారత మీడియం పేసర్ దీపక్ చాహర్.. చెన్నై జట్టు తనను ఎంపిక చేసుకోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన ధర అమాంతం పెరుగుతున్నప్పుడు సంతోషించినట్లు పేర్కొన్న దీపక్.. రూ. 13 కోట్లకు చేరుకున్నాక ఇక ఆగిపోతే బాగుంటుందనుకున్నట్లు తెలిపాడు. సోమవారం దీపక్ మాట్లాడుతూ.. ‘చెన్నై తరఫునే ఆడాలనుకున్నా. వేరే జెర్సీలో నన్ను నేను ఊహించుకోలేకపోతున్నా. చెన్నై ప్లేయర్గా ఒక దశలో నా వేలం ఆగిపోతే బాగుంటుందనుకున్నా. రూ. 13 కోట్లకు చేరుకున్నాక ఆపేస్తే.. మిగిలిన డబ్బుతో ఇతర ఆటగాళ్లను కొనుగోలు చేయొచ్చని భావించా’అని చెప్పుకొచ్చాడు. తాజా వేలంలో చాహర్ను రూ. 14 కోట్లకు చెన్నై కొనుగోలు చేసుకున్న విషయం తెలిసిందే.