న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు విభజన శక్తులకు వ్యతిరేకంగా ఎన్నికల్లో ఓటు వేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. పశ్చిమ బెంగాల్, అసోంలో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ శనివారం జరుగుతుండగా.. ఈ సందర్భంగా ఆయన ఓటర్లనుద్దేశించి ట్వీట్ చేశారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్లు.. ముఖ్యంగా మహిళలు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అసోం పురోగతి, ఉజ్వల భవిష్యత్ కోసం ప్రజలు, యువత ఓటు వేయాలన్నారు. అసోం తొలి విడత ఎన్నికలు 47 స్థానాలకు, బెంగాల్లో 30 స్థానాలకు ఎన్నికలు పోలింగ్ జరుగుతోంది. వామపక్షాలు, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)లతో కూటమిగా బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ పడుతోంది. అసోంలో అధికారంలో ఉన్న బీజేపీ ఓడించాలని కాంగ్రెస్ నేతృత్వంలోని ‘మహాజోత్’ కూటమి ప్రయత్నిస్తోంది.