BJP | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల్లోని పది గ్రామాల ఓటర్లు కమలం పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. సమస్యలు పరిష్కరించడం లేదంటూ ఎన్నికలను బహిష్కరించారు. తాగునీరు, రోడ్లు, వంతెనలు, వైద్య సదుపాయాలు వంటి సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీలోని పిలిభిత్ జిల్లా బాక్స్పుర్, పురరైనా, ఉత్తరాఖండ్లోని రుద్రాపూర్, అర్జున్పుర్, గూలరభోజ, తదితర గ్రామాల్లో ఎన్నికలను బహిష్కరించారు.