హుజురాబాద్ రూరల్ : ఉద్యమ కారుడు, పేదింటి బిడ్డ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కోరారు. బుధవారం మండలంలోని కందుగుల, రాంపూర్, పోతిరెడ్డి పేట గ్రామాల్లో మహిళలతో ర్యాలీ నిర్వహించి, ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీఎం కేసీఆర్తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపిస్తే జూరాబాద్ నియోజవర్గంలో మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. రైతులకు రైతు బంధు, బీమా, ఉచిత విద్యుత్ లాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్దేనని గుర్తు చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ల లాంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ రేటు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నదని ఆరోపించారు.
అటువంటి బీజేపీలోకి ఈటల రాజేందర్పోయి కపట నాటకాలు ఆడుతున్నారని పేర్కొన్నారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కారు గుర్తుకు ఓటువేసి టీఆర్ఎస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆమె వెంట జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, సర్పంచ్లు ప్రభావతి, మనోహర్, పుల్లాచారి, మహిళలు ఉన్నారు.