అమరావతి : భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఈనెల 14న విశాఖపట్నంలో జరుగనున్న మూడో టీ-20 మ్యాచ్కు ఆన్లైన్లో టికెట్ల విక్రయాలు హాట్కేకుల్లా అమ్ముడుపోయాయి. రూ. 500 నుంచి రూ. 6వేల వరకు టికెట్లను ఆన్లైన్ లో పెట్టగా 80శాతం టికెట్లు అమ్ముడుపోయాయి . ఈనెల 8న స్టేడియం దగ్గర మిగత 20 శాతం టికెట్లను విక్రయించనున్నారు.
ACA-VDCA స్టేడియంలో జరుగనున్న డే అండ్ నైట్ మ్యాచ్కు ఆంధ్ర క్రికెట్ అసోసియోషన్, అధికారులు, పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. స్టేడియం సామర్థ్యం 27, 251 కాగా ఆన్లైన్లో 80 శాతం టికెట్లు అమ్ముడు పోయాయి. కొవిడ్ అనంతరం తొలిసారిగా విశాఖలో జరుగుతున్న మ్యాచ్కు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 15వందల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొననున్నారు.