అమరావతి : ఏపీ రాజధానిపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి స్పందించారు. అమరావతి నిర్మాణానికి పలు సూచనలు చేస్తూనే వైసీపీ ప్రతిపాదించిన మావిగన్ నమూనాపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఢిల్లీ నిర్మాణం తీరును ఆయన గుర్తు చేశారు. లక్షల కోట్ల అంచనాలతో అమరావతి ప్రణాళిక ఉందన్నారు. అప్పులపై ఆధారపడి క్యాపిటల్ సిటీని నిర్మించడం సరిదన్నారు.
రాజధాని రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రాజధానిని ఏకీకృత, దశలవారీగా నిర్మించాలని సూచించారు. ఆర్థిక క్రమశిక్షణ కలిగిన రాజధానిని నిర్మించాలని సూచించారు. మావిగన్ ప్రతిపాదనలతో పెట్టుబడిదారుల్లో అనిశ్చితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.