విశాఖపట్నం: భారత క్రికెటర్, ఇటీవలే ముగిసిన రంజీ సీజన్ దాకా ఆంధ్రా క్రికెట్ జట్టుకు సారథిగా వ్యవహరించిన తెలుగు క్రికెటర్ హనుమా విహారికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) షోకాజ్ నోటీసులు పంపించింది. రంజీ ట్రోఫీ క్వార్టర్స్లో మధ్యప్రదేశ్ చేతిలో ఓడిపోగానే విహారి.. సోషల్ మీడియా వేదికగా తాను కెప్టెన్గానే గాక ఆటగాడిగానూ ఆంధ్రా జట్టుకు రాజీనామా చేస్తున్నానని, ఇక మళ్లీ ఆ జట్టుకు ఆడబోనని రాసుకొచ్చాడు.
దీనిపై నెల రోజుల తర్వాత ఏసీఏ తాజాగా నోటీసులు పంపుతూ.. విహారి అప్పుడు అలా ఎందుకు స్పందించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని వాటిలో పేర్కొంది. ఇదిలా ఉంటే సహచర ప్లేయర్ విహారితో అమర్యాదకరంగా ప్రవర్తించడం ఈ వివాదానికి కారణమైన సంగతి తెలిసిందే.