హైదరాబాద్: నగరంలోని ఎన్ఎండీసీ వద్ద పెను ప్రమాదం తప్పింది. మెహదీపట్నం వైపు వెళ్తున్న కూరగాయల లారీ అదుపుతప్పి ఎన్ఎండీసీ సమీపంలో బోల్తా పడింది. లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో మెహదీపట్నం వరకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో లక్డీకపూల్, బంజారాహిల్స్ వైపునుంచి వచ్చే వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో లారీని అక్కడి నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.