జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalapalli) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసు కుంది. ఆర్టీసీ బస్సు (RTC Bus), డీసీఎం వ్యాను ఢీ కొనడంతో డీసీఎం డ్రైవర్ (DCM driver) మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన రేగొండ మండలం బాగిర్తిపేట క్రాస్ వద్ద ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ మృతి చెందగా బస్ డ్రైవర్తో పాటు పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పరకాల హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఉదయం పొగ మంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది.