రాష్ట్రంలో పాడి పరిశ్రమను మరింత బలోపేతం చేసి, పాడి రైతులకు మెరుగైన ఆదాయం కల్పించడంతోపాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. శాసనసభలో సభ్యులు పటోళ్ల సంజీవరెడ్డి, చికుడు వంశీకృష్ణ, గండ్ర సత్యనారాయణరావు, వీర్లపల్లి శంకర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
రాష్ట్రంలో పాల ఉత్పత్తి క్రమంగా పెరుగుతున్నదని అన్నారు. పాడి రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం అందించేందుకు బర్రె పాలకు ప్రతి కిలో వెన్నకు రూ.914, ఆవు పాలకు ప్రతి కిలో వెన్నతోపాటు మొత్తం ఘనపదార్థాల ప్రాతిపదికన రూ.340 ధరను నిర్ణయించామని తెలిపారు.