యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వి. ప్రకాశ్ మంగళవారం దర్శించుకున్నారు.
ఆయనకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.