హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఐటీని విరివిగా వాడుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ‘సర్’ నేపథ్యంలో బుధవారం జిల్లా, మండలస్థాయి మాస్టర్ ట్రైనర్స్, ఐటీ సపోర్ట్ టీం, డాటా ఆపరేటర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన శిక్షణలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సర్’లో ఐటీ కీలకమైందని, దానిని సి బ్బంది వాడుకోవాలని సూచించారు. ఓ టరు నమోదుకు vote.eci.gov.in వెబ్ససైట్ను విస్తృతంగా వినియోగించుకోవాలని నిర్దేశించారు. భారత ఎన్నికల సంఘం ఈసీఐనెట్, బీఎల్ఓ యా ప్లను అందుబాటులోకి తెచ్చిందని గుర్తుచేశారు. శిక్షణ నోడల్ అధికారి చె న్నయ్య ‘సర్’లోని దశలను వివరించా రు. అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వెంకటేశ్వర్రెడ్డి, ఉప ప్రధాన అధికారి చారిల, చిరంజీవి పాల్గొన్నారు.