న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 3 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 33 పోస్టులను భర్తీచేస్తున్నది. ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్, స్టోర్ ఆఫీసర్, అసిస్టెంట్ మినరల్ ఎకనమిస్ట్ వంటి పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నది.
మొత్తం ఖాళీలు: 33
ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్ 7, స్టోర్ ఆఫీసర్ 11, అసిస్టెంట్ మినరల్ ఎకనమిస్ట్ 14 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఆయుర్వేదాలో మెడిసిన్ చేసి ఉండాలి. ఎకనమిస్ట్ పోస్టులకు జియాలజీ, ఎకనమిక్స్, మైనింగ్ ఇంజినీరింగ్లో ఏదో చేసి, సంబంధిత రంగంలో మూడేండ్ల అనుభవం ఉన్నవారై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 3
వెబ్సైట్: www.upsc.gov.in