Alyssa Healy : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్).. బీసీసీఐ మొదటిసారి నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ మహిళా క్రికెట్లో నూతన అధ్యాయానికి నాంది పలికిన విషయం తెలిసిందే. మహిళా క్రికెట్కు మహర్ధశగా పేరొందిన ఈ లీగ్ ప్రాధాన్యం గురించి యూపీ వారియర్స్ అలిసా హేలీ (ఆస్ట్రేలియా) ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ‘డబ్ల్యూపీఎల్ వేలం తమ ఆట స్వరూపాన్నే మార్చేసిందని ఆమె అంది. ఇప్పుడు క్రికెటర్లుగా మాకున్న అవకాశాలను చూస్తుంటే నమ్మబుద్ధి కావడం లేదు. ప్రస్తుతం మేము ఆటను నమ్ముకుని
బతికే పరిస్థితిలో ఉన్నాం. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆడుతూ డబ్బులు సంపాదించుకొనే వీలుంది’ అని హేలీ తెలిపింది. ఫిబ్రవరి 13న ముంబైలో జరిగిన తొలి సీజన్ వేలంలో హేలీని రూ. 70 లక్షలకు యూపీ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. ఇప్పటివరకు ఈ లీగ్లో యూపీ వారియర్స్ రెండు మ్యాచులు ఆడింది. తొలి పోరులో గుజరాత్ జెయింట్స్పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 42 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రీడాకారులకు అత్యధిక ధర చెల్లిస్తున్న రెండో టోర్నమెంట్గా డబ్ల్యూపీఎల్ రికార్డు సాధించింది. అవును.. అమెరికాలోని బాస్కెట్ బాల్ చాంపియన్షిప్ మొదటి స్థానంలో ఉంది. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ ద్వారా మహిళా క్రికెటర్ల సంపాదన పెరిగింది. ఈ మెగా టోర్నమెంట్లో మొత్తం ఐదు ఫ్రాంఛైజీలు పోటీ పడుతున్నాయి. వరుసగా రెండు విజయాలతో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నాయి. సమఉజ్జీలైన ఈ రెండు జట్లు ఈ రోజు డీవై పాటిల్ స్టేడియంలో తలపడనున్నాయి.