న్యూఢిల్లీ : వచ్చే జూలై నెలలో మొదలయ్యే సెషన్ కోసం ఆన్లైన్ కోర్సులు, ఎంఓఓసీలను యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రారంభించింది. 83 యూజీ, 40 పీజీ, నాన్ ఇంజనీరింగ్ కోర్సులను ఆన్లైన్లో నిర్వహించేందుకు యూజీసీ నిర్ణయించింది. సోషల్ మీడియా ద్వారా కమిషన్ ఈ సమాచారం ఇచ్చింది.
“కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు విద్యార్థుల ప్రయోజనం కోసం స్వయం ఆన్లైన్ ప్లాట్ఫామ్ను గరిష్టంగా ఉపయోగించుకోవాలని అభ్యర్థిస్తున్నాం. జూలై-అక్టోబర్ సెమిస్టర్ కోసం 83 యూజీ, 40 పీజీ ఎంఓఓసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటికి సబంధించిన పూర్తి సమాచారాన్ని swayam.gov.in లో చూడవచ్చు” అని యూజీసీ పేర్కొన్నది.
యూజీసీ అధికారిక వెబ్సైట్ ugc.ac.in నందు జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్ను అందుబాటులో ఉంచారు. ఇది కాకుండా, కోర్సుల్లోని విద్యార్థుల జాబితాను వెబ్సైట్లో కూడా చూడవచ్చు. యూజీసీ ఎంఓఓసీ కోర్సులు విద్యార్థులతోపాటు పని చేసే నిపుణులకు ప్రయోజనకరంగా ఉంటాయి.
వ్యాక్సిన్ వేసుకుంది.. లాటరీ కొట్టేసింది..
నా రూటే సెపరేటు అన్నాడు.. పుష్ అప్స్ తీయించాడు..
ఎవరెస్ట్ను అధిరోహించిన నార్గే, హిల్లరీ.. చరిత్రలో ఈరోజు
జూన్ 20 వరకు జపాన్లో ఎమర్జెన్సీ.. ఒలింపిక్స్కు ముందు సమస్యలు
వచ్చే ఏడాది జూలై 30 న బోరిస్ జాన్సన్ పెండ్లి
ఇమ్యూనిటీ కోసం జింక్ లభించే 5 ఆహారాలు..
మహిళల ఆరోగ్యానికి సూపర్ ఫుడ్స్..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..