సిద్దిపేట : కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామంలోని మోయ తుమ్మెద వాగులో ఆదివారం సాయంత్రం ఇద్దరు గల్లంతయ్యారు. గ్రామానికి చెందిన మేదర రాజ్కుమార్ (28), చంచల రోహిత్ (10) అనే బాలుడు కలిసి సాయంత్రం వాగు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో సరదాగా మొబైల్లో ఫొటోలు తీసుకుంటున్న క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడిపోవడంతో కొట్టుకుపోయారు. స్థానిక జాలర్లు ఇద్దరి ఆచూకీ కోసం అణ్వేషించినా ఫలితం లేకుండా పోయింది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా.. ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.