హైదరాబాద్ : నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. వనస్థలిపురం పరిధిలోని సాహెబ్నగర్లో డ్రైనేజీని శుభ్రం చేసేందుకు దిగి ఇద్దరు కార్మికులు అంతయ్య, శివ అనే కార్మికులు మృతి చెందారు. అయితే, రాత్రిపూట డ్రైనేజ్ క్లీన్ చేసేందుకు అనుమతి లేదు. కాంట్రాక్టర్ బలవంతం మేరకు నలుగురు కార్మికులు మురికి కాలువలో దిగారు. ఆ ఊబిలో శివ అనే వ్యక్తి చిక్కుకుపోవడంతో కాపాడేందుకు వెళ్లిన అంతయ్య సైతం అందులోనే చిక్కుకొని ఊపిరి ఆడక మృతి చెందారు. ఇద్దరు బయట ఉండగా.. కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మ్యాన్హోల్ మృతదేహాలను వెలికి తీశారు. మృతుడు శివకుమార్కు మూడేళ్ల కిందట వివాహం కాగా.. భార్య ఎనిమిది నెలల గర్భవతి. ఇంకా ఆమెకు భర్త మృతిపై కుటుంబీకులు సమాచారం ఇవ్వలేదు. అంతయ్యకు భార్య కూతురు, కొడుకు ఉన్నారు. మృతులిద్దరూ సైదాబాద్, చింతల్బస్తీకి చెందిన వారు కాగా.. ఆయా ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.