వరంగల్ చౌరస్తా, జనవరి 5: వరంగల్ ఎంజీఎం దవాఖానలోని కొవిడ్ వార్డులో శుక్రవారం మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటీవల చికిత్స కోసం పలువురు దవాఖానకు రాగా, సేకరించిన నమూనాలను కేఎంసీలోని వైరాలజీ ల్యాబ్కు పంపా రు. అందులో ఇద్దరికి కరోనా జేఎన్.1గా నిర్ధారించారు. ప్రస్తుతం కొ విడ్ వార్డులో ముగ్గురు చికిత్స పొందుతున్నట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.