మెదక్ అర్బన్, మే22: చెరువులో స్నానానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన హవేళీఘనపూర్ మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. హవేళీఘనపూర్ ఎస్సై మురళి కథనం ప్రకారం.. మెదక్ మండలం రాజ్పల్లి గ్రామానికి చెందిన గంగారాం (35), చిన్న కోడూరు మండలం గోనెపల్లి గ్రామానికి చెందిన లక్ష్మణ్(18) తిమ్మాయిపల్లి గ్రామంలో జరుగుతున్న ఎల్లమ్మ జాతరకు వెళ్లారు.
తమ బంధువులైన ఎరుకల సిద్ధిరాములు ఇంటికి వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక గిద్దకుంటలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మెదక్ ఏరియా దవాఖానకు తరలించారు.