సికింద్రాబాద్, జూలై 7: భార్యా భర్తల మధ్య గొడవలు జరగడంతో ఓ టీవీ చానల్లో ప్రసారమయ్యే కార్యక్రమంలో తన సమస్యను పరిష్కరించుకునేందుకు నగరానికి వచ్చిన మహిళపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. మహంకాళి పోలీస్స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్లోని ఓ తండాకు చెందిన మహిళకు తొమ్మిదేండ్ల క్రితం సిరిసిల్లకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది.
కొంతకాలంగా తగాదాలు జరుగుతుండడంతో సోమవారం మహబూబాబాద్ నుంచి నగరానికి వచ్చింది. టీవీ ఛానల్ కోసం వెతుకుతూ మంగళవారం తెల్లవారుజామున సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు చేరుకుంది. ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి తనకు టీవీ చానల్ తెలుసునని నమ్మించి ఎంజీ రోడ్డులోని హైదర్ కాంప్లెక్స్ వద్దకు తీసుకెళ్లి తన స్నేహితుడితో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.