హాంకాంగ్: హాంకాంగ్ విమానాశ్రయంలో (Hong Kong Airport) ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఎయిర్పోర్టులు దిగుతుండగా ఓ భారీ కార్గో విమానం (Cargo Plane) రన్వేపై అదుపు తప్పి సముద్రంలో పడిపోయింది. దీంతో రన్వేపై గ్రౌండ్ వెహికల్లో ఉన్న ఇద్దరు సిబ్బంది మరణించారు. సోమవారం తెల్లవారుజామున 3.50 గంటల సమయంలో ఎమిరేట్స్ చెందిన బోయింగ్ 747-481 మోడల్ కార్గో విమానం దుబాయ్ నుంచి హాంకాంగ్ చేరుకుంది. హాంకాంగ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టులో అత్యంత రద్దీగా ఉండే నార్త్ రన్వేపై దిగిన కార్గో విమానం.. అదుపుతప్పి ఓ వాహనాన్ని ఢీకొని సముద్రంలో పడిపోయింది. దీంతో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరిని సిబ్బంది రక్షించారు.
ఈ విమానాన్ని టర్కీకి చెందిన ఏసీటీ ఎయిర్ లైన్స్ సంస్థ ఎమిరేట్స్ నుంచి లీజుకు తీసుకొని నడుపుతున్నది. ప్రమాదం జరిగిన రన్వేను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అయితే విమానాశ్రయంలోని మిగతా రెండు రన్వేలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.
🚨🇨🇳#BREAKING | NEWS ⚠️
New photo of the cargo plane that departed from Dubai and headed to Hong Kong crashed into a ground vehicle while landing at the Hong Kong International Airport in China then skid it off the runway into the sea all 4 crew members aboard were rescued The… pic.twitter.com/C7nyOK82G4— Todd Paron🇺🇸🇬🇷🎧👽 (@tparon) October 19, 2025