హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల విభజనకు రాష్ట్ర సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి సోమవారం మార్గదర్శకాలు జారీచేసింది. కొత్త జిల్లాలు, జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన విధివిధానాలపై సీఎస్ సోమేశ్కుమార్ జీవో 317 జారీ చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులు-2018కి లోబడి కొత్త జోన్లు, జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల విభజనను చేపట్టనున్నారు. ఉద్యోగుల కేటాయింపు కోసం రెండు కమిటీలను ఏర్పాటు చేశారు. ఆయా కమిటీల నివేదికల ఆధారంగా ఉద్యోగులను కేటాయించనున్నారు. ప్రస్తుతానికి ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో విభజన, కేటాయింపులు ప్రారంభం కానుండగా, మిగతా జిల్లాల్లో కోడ్ ముగిశాక ప్రక్రియను చేపడతారు. పూర్తిస్థాయి షెడ్యూల్ను త్వరలోనే విడుదల చేస్తామని సీఎస్ ఆ జీవోలో పేర్కొన్నారు. ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకొన్నా సీనియార్టీ ప్రకారమే కేటాయింపులు జరుగనున్నాయి.
మల్టీ జోనల్ క్యాడర్ పోస్టులు
మార్గదర్శకాల్లో మరిన్ని ముఖ్యాంశాలు:
ఉద్యోగ సంఘాల హర్షాతిరేకాలు
హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల విభజన, కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేయడం పట్ల ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తంచేశారు. సచివాలయంలో జీఏడీ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్ను టీఎన్జీవో నేతలు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్, జగదీశ్వర్ కలిసి ధన్యవాదాలు తెలిపారు.
జిల్లాస్థాయి పోస్టులకు
జిల్లాస్థాయి పోస్టులకు ఉమ్మడి జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఉద్యోగులను కేటాయించనున్నది. ఉమ్మడి జిల్లా కలెక్టర్ ఈ కమిటీకి చైర్మన్గా, సంబంధితశాఖల జిల్లా హెచ్వోడీలు సభ్యులుగా ఉంటారు.
జోనల్, మల్టీ జోనల్ పోస్టులకు
జోనల్, మల్టీ జోనల్ పోస్టులకు జీఏడీ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తారు. సంబంధిత శాఖల స్పెషల్ సీఎస్/ ముఖ్యకార్యదర్శి/ కార్యదర్శి/ హెచ్వోడీ, ఆర్థికశాఖ సీనియర్ కన్సల్టెంట్, ప్రభుత్వం నిర్ణయించిన ఇతర సీనియర్ అధికారి కమిటీలో సభ్యులుగా ఉంటారు.
ఉద్యోగుల మదిలో చిరకాలం సీఎం కేసీఆర్
ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు విడుదల చేయటం హర్షణీయం. 33 జిల్లాలను ఏర్పాటు చేయడమే కాకుండా, ఏ రాష్ట్రంలో లేని విధంగా 95 శాతం ఉద్యోగాలు దక్కేలా కొత్త జోన్లు, జిల్లాలను అమల్లోకి తీసుకురావటం సంతోషకరం. 33 జిల్లాల్లోని ఉద్యోగులకు భారీ ఉపశమనం కలగనున్నది. ఏ జిల్లా ఉద్యోగి ఆ జిల్లాలోనే పనిచేసేలా మార్గదర్శకాలు ఇవ్వటం ద్వారా ఉద్యోగుల మదిలో సీఎం కేసీఆర్ చిరకాలం ఉంటారు.
ఆమోదయోగ్య మార్గదర్శకాలు
ఉద్యోగుల కేటాయింపు కష్టమైన పని. రాష్ట్ర విభజన సమయంలోనూ కమలనాథన్ కమిటీ కొర్రీలు పెట్టి ఇబ్బందులు పెట్టింది. కానీ ఇప్పుడు జిల్లాలు, జోన్ల ప్రకారం ఉద్యోగులకు కేటాయింపు సందర్భంగా ఉద్యోగులెవరూ నష్టపోకుండా, సీనియార్టీ ప్రకారం అందరికీ ఆమోదయోగ్యమైన మార్గదర్శకాలిచ్చారు. ఉద్యోగులకు మంచి చేయాలని, నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇవ్వాలన్న ఆకాంక్షతో సీఎం కేసీఆర్ మార్గదర్శకాలను జారీచేశారు. ఉద్యోగులకు సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్తే పరిష్కరిస్తారు.
బదిలీలు,పదోన్నతులకు ఆస్కారం
రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు సంతృప్తికరంగా ఉన్నాయి. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయుల కేటాయింపు సులభతరం కానున్నది. ఆర్డర్ టూ సర్వ్ విధానంలో పనిచేస్తున్న వారిని రెగ్యులర్ పోస్టుల్లో కేటాయిస్తారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. కొత్త జిల్లాతో పాటు, పాత జిల్లాల్లోనూ ఆప్షన్ ఇచ్చుకొనే అవకాశమివ్వటం స్వాగతించాల్సిన అంశం.
సీనియార్టీని కాపాడటం హర్షణీయం
ఉద్యోగుల సీనియార్టీని కాపాడుతూ విభజన చేపట్టేందుకు మార్గదర్శకాలివ్వటం హర్షణీయం. పాత జిల్లాల్లోని ఉద్యోగులను కొత్త జిల్లాలకు సర్దుబాటు చేసేలా చర్యలు తీసుకొన్నారు. ఉద్యోగుల విభజన పూర్తయితే కొత్త నోటిఫికేషన్లకు ఆస్కారం ఉంటుంది. తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు దక్కుతాయి.