వినాయక నగర్, ఏప్రిల్ 18: మల్టీజోన్-1 పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు సీఐలపై వేటుపడింది. నిజామాబాద్ సీసీఎస్ సీఐ రమేశ్తోపాటు గతంలో బోధన్ సీఐగా పనిచేసిన ప్రేమ్కుమార్ను సస్పెండ్ చేస్తూ ఐజీపీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ సీసీఎస్ సీఐ రమేశ్ మద్యం సేవించి విధులు నిర్వహించినట్లు ఆరోపణలు రాగా..విచారణలో వాస్తవమని తేలడంతో సస్పెండ్ చేశారు. గతంలో బోధన్ సీఐగా విధులు నిర్వర్తించిన ప్రేమ్కుమార్పై సైతం వేటు వేసినట్లు సమాచారం.