న్యూఢిల్లీ : మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సేవలు శుక్రవారం సాయంత్రం నిలిచిపోయాయి. దాంతో చాలా మంది వినియోగదారులు తీవ్రంగా ప్రభావితమైనట్లు తెలుస్తున్నది. శనివారం ఉదయం 6.21 గంటలకు వినియోగదారుల ట్వీట్లు లోడ్ కాలేదని కంపెనీ ట్వీట్ చేసింది. ఈ సమస్య పరిష్కారంపై పని చేస్తున్నామని, త్వరలో పరిష్కరిస్తామని సంస్థ హామీ ఇచ్చింది.
డౌన్డెక్టెక్టర్.కామ్ నివేదిక ప్రకారం, శుక్రవారం సాయంత్రం 40,000 మంది వినియోగదారులు ట్విట్టర్ ప్లాట్ఫాం నుంచి ఎదుర్కొన్న సమస్య గురించి ఫిర్యాదు చేశారు. తాము చేసిన పోస్టులు లోడ్ కావడం లేదని గ్రహించిన వినియోగదారులు సంస్థ దృష్టికి తీసుకొచ్చారు. ఒక కొత్త ఫీచర్ను తీసుకువస్తున్న కారణంగానే ఇలాంటి సమస్య ఎదురైనట్లుగా తెలుస్తున్నది. అయితే, సంస్థ మాత్రం ఎలాంటి కారణం తెలుపలేదు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామంటూ హామీ మాత్రమే ఇచ్చింది.
ట్విట్టర్ త్వరలో తప వినియోగదారుల కోసం కొత్త ఫీచర్ను విడుదల చేయనున్నది. ఈ క్రొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు వారి స్వంత టైమ్లైన్లో యూట్యూబ్ వీడియోలను చూసే వీలుంటుంది. ఈ క్రొత్త ఫీచర్ వినియోగదారులకు వీడియోలను చూడటం సులభతరం చేస్తుందని కంపెనీ అభిప్రాయపడింది.
ట్విట్టర్ యొక్క కొత్త ఫీచర్లు ప్రస్తుతం అమెరికా, జపాన్, కెనడా, సౌదీ అరేబియా దేశాల్లో పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ను త్వరలో ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
కొత్త ఫీచర్ను నాలుగు వారాల పాటు పరీక్షిస్తున్నామని, ఫలితాల ఆధారంగా ఈ ఫీచర్ను ప్రారంభించడం గురించి నిర్ణయం తీసుకుంటామని ట్విట్టర్ ప్రతినిధి ఒకరు చెప్పారు.
నేపాల్లో వైభవంగా విషాల్ సింధూర్ జాతర
మేధోసంపత్తి అడ్డంకులు తొలగించండి.. బైడెన్కు ఎంపీల వినతి
రక్తం గడ్డకట్టకపోతే తీవ్ర ప్రమాదం.. చరిత్రలో ఈరోజు
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
టీకా ఆఫర్ : రిబెట్ ఇస్తున్న దుబాయ్ హోటల్స్
జూన్ 1 నుంచి హాల్మార్క్ నగలే అమ్మాలి..
టీకా వేసుకోండి.. ఎక్కువ వడ్డీ పొందండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..