హైదరాబాద్, జూన్ 9: భారతదేశంలో అతిపెద్ద కిచెన్ అప్లయెన్సెస్ బ్రాండ్ టీటీకె ప్రెస్టిజ్ స్వచ్ఛ్ గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ను హైదరాబాద్లో విడుదల చేసింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా అత్యంత సులభంగా శుభ్రపరుచుకోగలిగిన డిజైన్ తో ఈ స్టవ్ ను రూపొందించారు. ఈ గ్యాస్ స్టవ్లను టీటీకె ప్రెస్టిజ్ హోసూర్ ఫ్యాక్టరీలో తయారుచేస్తున్నారు. భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ గ్యాస్ స్టవ్ను తీర్చిదిద్దారు. ఎలాంటి పగుళ్లు లేవని భరోసా అందించేందుకు అత్యంత ఉత్తమమైన గ్లాస్ను వినియోగించారు. వంట చేసేటప్పుడు పాత్రలు కదలకుండా ఉండేందుకు ధృడమైన పాన్ మద్దతు అందిస్తుంది.
టీటీకె ప్రెస్టిజ్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రు కల్రో మాట్లాడుతూ ‘‘దశాబ్దాలుగా గ్యాస్ స్టవ్లలో ఈ తరహా వినూత్న ఆవిష్కరణలు రాలేదు. కిచెన్ అప్లయెన్సెస్ విభాగంలో మార్కెట్ అగ్రగామిగా ఈ విప్లవాత్మక గ్యాస్ స్టవ్ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్లలోకి విడుదల చేయడం పట్ల సంతోషంగా ఉన్నామని’ అన్నారు. ‘మెరుగైన పనితీరు, సౌకర్యాలకు ప్రతిరూపంగా ఈ స్వచ్ఛ్ గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ ఉంటుందని’ తెలిపారు.