తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనం టికెట్లు నేడు విడుదల కానున్నాయి. నవంబర్ నెలకు సంబంధించిన ఉచిత టికెట్లను టీటీడీ ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. శనివారం ఉదయం 9 విడుదల చేయనున్నారు. రోజుకు 10 వేల చొప్పున సర్వదర్శనం టికెట్లను అందుబాటులో ఉంచుతుంది.
అక్టోబర్ నెలకు సంబంధించిన కోటా టికెట్లను సెప్టెంబర్ 26న టీటీడీ విడుదల చేసింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 31 వరకు టికెట్లను అందుబాటులో ఉంచింది. ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టికెట్లను విడుదల చేయగా అరగంటలోపే ఖాళీ అయ్యాయి. రోజుకు 8వేల చొప్పున మొత్తం 35 రోజుల టికెట్లను 30 నిమిషాల్లోనే భక్తులు బుక్ చేసుకున్నారు.