తిరుపతి, జూలై :టీటీడీ స్థానిక ఆలయాల అభివృద్ధిపై దృష్టి సారించింది. అందులోభాగంగా స్థానిక ఆలయాల ప్రశస్త్యాన్ని, స్థల పురాణాన్ని విస్తృత ప్రచారం చేసి టూరిజం, ఆర్టీసీ శాఖలను సమన్వయం చేసుకుని భక్తుల సంఖ్య పెంచేలా ప్రణాళికలు తయారు చేయాలని టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి అధికారులను ఆదేశించారు. టిటిడి పరిపాలన భవనంలోని చాంబర్లో మంగళవారం స్థానిక ఆలయాల కార్యకలాపాలపై అధికారులతో ఆయన సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడి స్థానిక ఆలయాలకు సంబంధించిన స్థల పురాణం, ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ టిటిడి వెబ్సైట్, ఎస్వీబీసిలో ప్రచారం చేయాలన్నారు. తిరుపతిలోని పద్మావతి నిలయం, శ్రీనివాసం, విష్ణునివాసం వసతి సముదాయాలతో పాటు ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్లో ఈ ఆలయాల గురించి భక్తులకు తెలిసేలా ప్రచారం ఏర్పాట్లు చేయాలన్నారు.
టూరిజం, ఆర్టీసీ అధికారులతో సంప్రదించి ప్యాకేజి టూర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. స్థానిక ఆలయాల్లో అవసరాలను బట్టి సేవలు ప్రవేశపెట్టే అవకాశాలు పరిశీలించాలన్నారు. ప్రతి ఆలయానికి సంబంధించి ఒక బుక్ తయారు చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.