తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల ( Tirumala ) శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు 18 కంపార్ట్మెంట్ల ( Compartments ) లో భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో స్వామివారి సర్వదర్శనం ( Sarvadarsan) అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 74,024 మంది భక్తులు దర్శించుకోగా 32,688 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.96 కోట్లు వచ్చిందన్నారు.
టీటీడీకి బ్యాటరీ వాహనం విరాళం
హైదరాబాద్ కు చెందిన డాక్టర్ బాల భాస్కర్ రెడ్డి అనే భక్తుడు టీటీడీకి రూ.4.5 లక్షల విలువైన బ్యాటరీతో నడిచే వాహనాన్ని ( బగ్గీ) విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయం ఎదుట పూజలు నిర్వహించిన అనంతరం తిరుమల డీఐ జానకిరామిరెడ్డికి దాత బ్యాటరీ వాహనం అందజేశారు.