తిరుమల, 30 మే : తిరుమల శ్రీవారి ఆలయ సన్నిధి యాదవ పద్మనాభంయాదవ్ గుండె పోటుతో శనివారం కన్ను మూశారు. ఆయన కుటుంబాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆదివారంపరామర్శించారు. పద్మనాభం మరణ వార్త తెలుసుకున్న సుబ్బారెడ్డి వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు.
పద్మనాభం ఆకస్మిక మరణం పట్ల చైర్మన్ సంతాపం తెలియజేశారు. టీటీడీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారికి భరోసా ఇచ్చారు.శ్రీ వేంకటేశ్వర స్వామి ఆయన కుటుంబ సభ్యులకు మనో ధైర్యం ప్రసాదించాలని సుబ్బారెడ్డి కోరారు. స్వర్గీయ పద్మనాభం కుటుంబం కొన్ని దశాబ్దాలుగా స్వామివారి సేవలో ఉందన్నారు. శ్రీవారి ఆలయ తలుపులు మొదట తెరిచి దర్శనం చేసుకునే అదృష్టం స్వామి వారు పద్మనాభం కు ప్రసాదించారని చైర్మన్ పేర్కొన్నారు.