TSPSC | హైదరాబాద్ : రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న 1388 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీ కోసం డిసెంబర్ 30, 2022లో విడుదల చేసిన నోటిఫికేషన్లో 33.33 శాతం మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. అందుకు సంబంధించిన కొత్త బ్రేకప్ వివరాలను టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు అధికారులు తెలిపారు.