కామారెడ్డి: తన కూతురు మహతి పుట్టు ఒల్లెల కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సభ్యురాలు తానోబా సుమిత్రానంద్ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ను సోమవారం కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు. ఈనెల 10 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాల్ లో జరిగే శుభ కార్యానికి రావాలని కోరారు. 2011 డిసెంబర్ 11 వ తేదీన కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డిలో జరిగిన మహతి నామకరణ మహోత్సవానికి తెలంగాణ ఉద్యమ సారధిగా కేసీఆర్ దంపతులు హాజరై నామకరణం చేశారనీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ప్రగతి భవన్లో కలిసిన మహతితో కేసీఆర్ ముచ్చటించి, క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మహతిని అభినందించి దివేనలు అందజేశారు, మహతితో పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో చిన్నమల్లారెడ్డి చైతన్య విద్యానికేతన్ అధినేత తానోబా ఆనంద్ రావు ఉన్నారు.