హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ ఉద్యోగులు రుణపరపతి సహకార సంఘం (సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనకి తీసుకునేందుకు వచ్చిన అఫ్లికేషన్లను పరిషరించి చెల్లింపులు ప్రారంభించాలని సీసీఎస్ నిర్ణయించింది. వారంరోజుల్లోపే ఈ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని సీసీఎస్ వర్గాలు వెల్లడించాయి.
టీఎస్ ఆర్టీసీలోని ఉద్యోగులు, కార్మికులు కలిసి రుణపరపతి సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నెలనెలా వేతనంలోంచి కొంత సొమ్మును సీసీఎస్లో పొదుపు చేసుకుంటారు. అవసరం వచ్చినప్పుడు తకువ వడ్డీతో రుణం తీసుకుంటారు. సభ్యత్వం రద్దు చేసుకున్నప్పుడు లేదా ఉద్యోగ విరమణ పొందినప్పుడు వారి సొమ్మంతా వడ్డీతో కలిపి వెనకి వస్తుంది. ఈ సొమ్మును ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం వాడేసుకుంది. దీంతో 2020 అక్టోబర్ నుంచి అప్లికేషన్లు పెండింగ్లో ఉండటంతో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు.
గతంలో సీసీఎస్లో 51వేల మంది సభ్యులు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 31వేలకే పరిమితమైంది. అసలు, వడ్డీ కలిపి ఆర్టీసీ యాజమాన్యం తమకు రూ.1,130 కోట్లు ఇవ్వాలని సీసీఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం ఎట్టకేలకు స్పందించి ప్రస్తుతానికి రూ.150 కోట్లు చెల్లించింది. కార్మికుల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో 10,600 పెండింగ్లో ఉన్నాయి. ఇందులో రుణం కోసం వచ్చినవి 6,800 కావటం విశేషం. ఉద్యోగ విరమణ చెందిన వారివి వెయ్యి, సభ్యత్వం రద్దు చేసుకున్న ఉద్యోగుల నుంచి 2,800 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. లోన్ అప్లికేషన్ల కోసం రూ.200కోట్లు.. రిటైర్మెంట్, సభ్యత్వం రద్దు చేసుకున్నవారికి రూ.90 కోట్లకుపైగా కావాల్సి ఉంటుంది. యాజమాన్యం ఇచ్చినవి రూ.150కోట్లు కాగా, సీసీఎస్ రూ.150 కోట్లను రుణంగా తీసుకుంటోంది. దీంతో దరఖాస్తుదారులకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతున్నాయని సీసీఎస్ ప్రతినిధి వెల్లడించారు.
హైదరాబాద్-విజయవాడ రూట్లో ప్రతి 10నిమిషాలకో ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉంటుందని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. అందులో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్- ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ 62 ఉన్నాయన్నారు. ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి తిరుగుప్రయాణ టికెట్పై 10 శాతం డిసౌంట్ వర్తిస్తుందన్నారు. ముందస్తు రిజర్వేషన్ కోసం అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.inని సంప్రదించాలని సూచించారు.