ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల పరిధిలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఎడ్సెట్ – 2021 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. సోమ, మంగళవారాల్లో నిర్వహించిన ఈ పరీక్షను రెండు తెలుగు రాష్ట్రాలలో కలిసి 54 కేంద్రాల్లో నిర్వహించినట్లు ఎడ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎ. రామకృష్ణ తెలిపారు.
ఈ పరీక్షకు మొత్తం 42,399 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 34,185 మంది పరీక్షకు హాజరయ్యారని చెప్పారు. మొత్తమ్మీద హాజరుశాతం 80.5 శాతంగా నమోదైందని వివరించారు. పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని ఈ నెల 29వ తేదీన విడుదల చేస్తామన్నారు.