కవాడిగూడ : ట్యాంక్బండ్ వద్ద గల జలవిహార్లో మంగళవారం జరిగే టీఆర్ఎస్ విస్తృత కార్యకర్తల సమావేశానికి ప్రతి డివిజన్ నుంచి వంద మంది తరలి వచ్చి విజయవంతం చేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పిలుపు నిచ్చారు. సోమవారం సాయంత్రం ముషీరాబాద్లోని వైశ్య భవన్లో నియోజకవర్గం టీఆర్ఎస్ విస్తృత కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్లాడుతూ నియోజకవర్గం నుంచి పెద్దెత్తున తరలి వచ్చి కార్యకర్తల ఐక్యత, బలాన్ని చాటిచెప్పాలని సూచించారు.
మంత్రి కేటీఆర్ను కలిసి నియోజకవర్గంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించాలన్నారు. ఈనెల 10 నుంచి ఎన్నుకునే డివిజన్ కమిటీలలో కొత్త, పాత తేడా లేకుండా అందరికీ అవకాశం కల్పిస్తామన్నారు. కమిటీల నియామకాలలో పెను మార్పులు ఉంటాయని పేర్కొన్నారు. కష్టపడే కార్యకర్తలను గుర్తించి డివిజన్ నాయకుల అభిప్రాయాలను తీసుకుని పదవులు కేటాయిస్తామన్నారు. ఈ నూతన కమిటీల నియామకాలలో మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఇతర పార్టీలకు ధీటుగా నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే విధంగా నూతన కమిటీలు ఉంటాయన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యువజన విభాగం నగర నాయకుడు ముఠా జైసింహ, మాజీ కార్పొరేటర్లు వి. శ్రీనివాస్ రెడ్డి, హేమలతరెడ్డి, ఎడ్ల భాగ్యలక్ష్మీ హరిబాబు యాదవ్, డివిజన్ అధ్యక్షులు సయ్యద్ భక్తీయార్, మహ్మద్ అలీ, శ్యాం సుందర్, పార్టీ సీనియర్ నాయకుడు ముచ్చకుర్తి ప్రభాకర్, సుధాకర్ గుప్తా, పి. శ్రీధర్చారి, శ్యామ్ యాదవ్, మారిశెట్టి నర్సింగ్రావు, నేత శ్రీనివాస్ తదితరలు పాల్గొన్నారు.