గోల్నాక, ఆగస్టు 11 : తెలంగాణ ఉద్యమ నేత గెల్లు శ్రీనివాస్యాదవ్ను హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడంతో అక్కడ గెలుపు ఖరారై పోయిందని సీనియర్ టీఆర్ఎస్ నేత దూసరి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం గెల్లు శ్రీనివాస్ను కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ..గెల్లు శ్రీనివాస్యాదవ్ వ్యక్తిత్వాన్ని, సేవాభావాన్ని, నిబద్ధతను గుర్తించి సీఎం కేసీఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం హర్షణీయమన్నారు. ప్రతి పక్షాలు ఎన్ని ఎత్తులు వేసినా అక్కడ టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.