చర్లపల్లి : టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు అండగా పార్టీ నిలబడుతుందని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించి టీఆర్ఎస్ నాయకుడు వంశీరాజుపై దాడి జరుగగా ఆయనను ఆసుపత్రిలో పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదర్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్లెక్సీ విషయంలో తలేత్తిన వివాదంలో టీఆర్ఎస్ యూత్ నాయకుడిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, నాయకులు కాసం మహిపాల్రెడ్డి, బేతాల బాల్రాజు, డప్పు గిరిబాబు, రెడ్డినాయక్, ప్రభాకర్రెడ్డి, జయకృష్ణ, గరిక సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.