హుజూరాబాద్: హుజురాబాద్ పట్టణంలోని 19 వార్డులో సిద్దిపేట కార్పొరేటర్ గుడాల శ్రీకాంత్, టీఆర్ఎస్ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు గందే సాయిచరణ్, మైనార్టీ నాయకుడు షేక్ ఫయాజ్లు సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ఈవీఎం నమూన చూపుతూ ఓటు ఎలా వేయాలి..? బటన్ దేనిపై నొక్కాలనేదానిపై అవగాహనకల్పించారు. ఈవీయంపై ఉన్న కారు గుర్తు సీరియల్ నెంబర్ 2 అని చూపిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు టీఆర్ఎస్ కార్యకర్తలు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.