హైదరాబాద్ / హుజూరాబాద్ : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్తో పాటు బీజేపీ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న అసత్య ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పార్టీ ప్రధానకార్యదర్శి సోమ భరత్కుమార్ పలు కేసులపై ఆధారాలతో పాటు కమిషన్కు ఫిర్యాదు చేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై అసత్య ఆరోపణలు, తీవ్ర నేరారోపణతో కూడిన కేసులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ , ఆ పార్టీ నాయకులు ఇరికించే ప్రయత్నం చేశారని ఎన్నికల కమిషన్కు ఆయన ఫిర్యాదు చేశారు.
టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై బీజేపీ అభ్యర్థి దుష్ప్రచారం చేస్తూ లబ్ధిపొందే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదు చేయడంతో పాటు, టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నేత జగన్ పై బీజేపీ నేతలు దాడి చేయడాన్ని కూడా ఆ ఫిర్యాదులో పొందుపరిచారు.
అలాగే హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తూ రోడ్ షోలు నిర్వహిస్తున్నా రని, టీఆర్ఎస్ డబ్బులు ఇస్తుందని దుష్ప్రచారం చేయడంతో పాటు, డబ్బులు తీసుకోమని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓటర్లును తప్పుదోవ పట్టించడం, టీఆర్ఎస్ మీద తప్పుడు ప్రచారం చేయడంపైన కూడా ఎన్నికల కమిషన్ కు తెలంగాణ రాష్ట్రసమితి ఫిర్యాదు చేసింది.