ఇల్లందకుంట: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపించాలని, సంక్షేమ సర్కారుకు అండగా నిలువాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కోరారు. సోమవారం ఆయన ఇల్లందకుంట మండలంలోని గడ్డివానిపల్లి, టేకుర్తి, సిరిసేడు, రాచపల్లి, మల్లన్నపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. హుజూరాబాద్ అభివృద్ధి బాటపట్టాలంటే టీఆర్ఎస్ పార్టీ మాత్రమే గెలువాలన్నారు. పేదింటి బిడ్డ గెల్లు శ్రీనివాస్యాదవ్ను ఆశీర్వదించాలని కోరారు. కాగా, ఆయా గ్రామాల్లో గెల్లు శ్రీనివాస్యాదవ్ సతీమణి గెల్లు శ్వేత కూడా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గడపగడపకూ తిరుగుతూ బొట్టు పెడుతూ ఓటు అభ్యర్థించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులున్నారు.